(1) రాష్ట్ర ప్రభుత్వం, అధిసూచన ద్వారా, రాష్ట్రంలో రాష్ట్ర కమిషన్ అని పిలువబడునట్టి రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఏర్పాటు చేయవలెను.
(2) రాష్ట్ర కమిషన్ సాధారణంగా రాష్ట్ర రాజధాని వద్ద పనిచేయవలెను మరియు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కమిషన్తో సంప్రదించి, అధికార గెజిట్లో అధిసూచించిన అట్టి ఇతర స్థలముల యందు తన విధులను నిర్వర్తించవలెను.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం, అధిసూచన ద్వారా, అది సముచితమని భావించిన అట్టి స్థలములలో, రాష్ట్ర కమిషన్ యొక్క ప్రాంతీయ ధర్మాసనాలను ఏర్పాటు చేయవచ్చును.
(3) ప్రతి రాష్ట్ర కమిషన్ ఈ క్రింది వారిని కలిగి ఉంటుంది—
(a) అధ్యక్షుడు; మరియు
(b) కనీసం నలుగురు లేదా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయించబడిన సభ్యుల సంఖ్యకు మించకుండా.