జిల్లా కమిషన్ చేసిన ఉత్తర్వు ద్వారా బాధిత ఏ వ్యక్తి అయినా, ఉత్తర్వు తేదీ నుండి నలభై ఐదు రోజుల లోపల, వాస్తవాలు లేదా చట్టం ఆధారంగా, నిర్దేశించిన విధంగా, అట్టి రూపంలో మరియు పద్ధతిలో, అట్టి ఉత్తర్వుపై రాష్ట్ర కమిషన్ కు అప్పీలును దాఖలు చేయవచ్చును.
అయితే, సదరు నలభై ఐదు రోజుల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా, ఆ కాలపరిమితిలోగా దానిని దాఖలు చేయనందుకు తగిన కారణం ఉన్నదని రాష్ట్ర కమిషన్ సంతృప్తి చెందినట్లయితే, అది అప్పీలును విచారించవచ్చు.
మరియు ఇంకనూ, జిల్లా కమిషన్ యొక్క ఉత్తర్వు మేరకు ఏదైనా మొత్తాన్ని చెల్లించవలసి ఉన్న వ్యక్తిచే దాఖలు చేయబడిన అప్పీలును, అప్పీలుదారుడు నిర్ణయించబడిన పద్ధతిలో ఆ మొత్తంలో యాభై శాతాన్ని జమ చేయనిదే, రాష్ట్ర కమిషన్ స్వీకరించరాదు:
మరియు ఏమనగా, సెక్షన్ 80 క్రింద మధ్యవర్తిత్వం ద్వారా జరిగిన రాజీ మేరకు జిల్లా కమిషన్ చే సెక్షన్ 81లోని సబ్-సెక్షన్ (1) క్రింద జారీ చేయబడిన ఏ ఉత్తర్వు నుండియు అప్పీలునకు వీలులేదు.